రోజులు గడుస్తూనే ఉన్నాయి కానీ కరోనా ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తగ్గలేదు సరికదా రోజు రోజుకు కేసులు ఎక్కువవుతున్నాయి తప్పా తగ్గే సూచనలు కనిపించట్లేదు. సామాన్యుల దగ్గరనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి..జాగ్రత్తలు తీసుకోవాలంటున్నాడు విక్టరీ వెంకటేష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా వెంకటేష్.. ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా..ఫేస్ మాస్కులు పెట్టుకోవడం కొనసాగించండి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రం చేసుకుని, శానిటైజ్ చేసుకోండి. సామాజిక దూరాన్ని మెయింటైన్ చేయడం కొనసాగించండి. కరోనా వైరస్ ఇప్పటికీ మనతోనే ఉంది. మనందరికీ ఇంకా చాలా ముప్పు ఉంది. మీ భద్రతను సీరియస్ గా తీసుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని ట్విటర్ లో తన సందేశాన్ని పోస్ట్ చేశాడు. మరి వెంకటేష్ చెప్పినట్టు ఇంకా కరోనా వైరస్ ప్రభావం అలానే ఉంది. నిర్లక్ష్యం చేసి జాగ్రత్తలు తీసుకోకపోతే మనకే నష్టం.
A request to everyone out there –
Please continue to wear your masks, wash your hands and sanitise regularly! Please continue to maintain social distancing!
The virus is still amongst us and is very much still a threat! Request everyone to take your safety more seriously 🙏
— Venkatesh Daggubati (@VenkyMama) September 16, 2020
కాగా వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘అసురన్’ తెలుగు రీమేక్ నారప్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి కొంత చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: