భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు ముఖ్య వినోద సాధనం సినిమా. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూత పడడంతో ప్రేక్షకులకు OTT సంస్థల ద్వారా ఉపశమనం లభించింది. OTT ల ద్వారా మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ ప్రసారం అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత , దర్శకులు వెబ్ సిరీస్ లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ సమంత , కాజల్ అగర్వాల్ , అంజలి , రమ్యకృష్ణ , రాశీఖన్నా వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కార్పొరేట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ హిట్ “గరుడ వేగ ” మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా కథానాయికగా 8 ఎపిసోడ్స్ తో కార్పొరేట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రలో అరుణ్ ఆదిత్ నటిస్తున్నారు. ప్రపంచంలో పోటీ తత్వం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ లో తమన్నా విలక్షణ మనస్తత్వం ఉన్న యువతి గా నటిస్తున్నారు. త్వరోలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.తమన్నా ప్రస్తుతం ఒక తెలుగు , ఒక హిందీ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: