కరోనా కారణంగా లాక్డౌన్తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్లకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ భయంతో ఇప్పటివరకూ హీరోలెవరూ షూటింగ్లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే యంగ్ హీరోలు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చిన్న చిన్నగా షూటింగ్ లను ప్రారంభిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, కింగ్ నాగార్జున ఇప్పటికే షూటింగ్ లను స్టార్ట్ చేశారు. తాజాగా సూపర్స్టార్ మహేష్ కూడా షూటింగ్కు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే అది సినిమా షూటింగ్ కాదులెండి .. ఏదో వాణిజ్య ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని రెండ్రోజుల్లో షూటింగ్ పూర్తి చేయనున్నారట. ఈ సందర్భంగా లోకేషన్లో తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: