సందీప్ కిషన్ తో నిను వీడని నీడను నేనే అనే సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ రాజు. ప్రస్తుతం రెజీనా ప్రధానపాత్రలో ‘నేనే నా’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. తమిళ్ లో హిట్టైన ‘‘ప్యార్ ప్రేమ కాదల్’’మూవీ ఫేం ‘‘రైజా విల్సన్’’ మెయిన్ లీడ్ గా ‘ది చేజ్’ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసాడు. చూడటానికి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది ఫస్ట్ లుక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా కార్తీక్ రాజు మాట్లాడుతూ.. తల్లీకూతురు, ఓ టీనేజర్ మధ్య సాగే కథాంశంతో ఈ ప్రాజెక్టు రానుంది. మా టీమ్ అంతా కలిసి ఈ లాక్ డౌన్ లో ఏదైనా క్రియేటివ్ గా ప్లాన్ చేయాలనుకొని ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాం. ప్రభుత్వ ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూనే తక్కువ మందితో షూట్ చేసాం.ఈ సినిమాకోసం ఓ పెద్ద ఫారెస్ట్ లోని హిల్ స్టేషన్ లో షూట్ చేశాం.సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నేను రెజీనా తో చేస్తున్న ‘‘నేనే నా’’ మూవీ నిర్మిస్తున్న యాపిల్ ట్రీ స్టూడియో బ్యానర్ మీద రాజశేఖర్ వర్మ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు.
కాగా అనసూయ, హరీష్ ఉత్తమన్, సత్యం రాజేశ్, మధునందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఖైదీ సినిమాలో కార్తీ కూతురిగా నటించిన అందరినీ మెప్పించిన మోనిక కీ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్గా వేల్ రాజ్ ,యాక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ గా శ్యామ్ సి.ఎస్ పని చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: