సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఈ రోజు 14వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా తనయుడికి మహేష్, నమ్రత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. మహేష్ తన ఇన్స్టా, ట్విట్టర్ లలో పసికందు గౌతమ్ ను ఎత్తుకున్న ఫొటో ను పోస్ట్ చేస్తూ.. 14వ వసంతంలోకి అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉంది… హ్యాపీ 14.. నువ్వు యువకుడిగా ఎదుగుతున్నందుకు గర్వంగా ఉంది. డోరేమాన్ నుంచి అపెక్స్ లెజెండ్స్ వరకు నీతో కలిసి చేసిన ప్రయాణం ప్రత్యేకమైనది. నీకు బెస్ట్ బర్త్డే విషెస్. లవ్ యూ గౌతమ్” అని రాసుకొచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరో వైపు నమ్రత కూడా తన కుమారుడికి బర్త్ డే విషెస్ తెలియచేసింది. గౌతమ్ ఈ ప్రపంచంలోకి రావడం మా జీవితాలనే మార్చేసింది. తొలిసారిగా మేము తల్లిదండ్రులమయ్యామన్న సంతోషాలను, అంతకు మించిన ప్రేమను తీసుకొచ్చాడు. ఇప్పుడుగౌతమ్ కి 14 ఏళ్లు. ప్రతి సంవత్సరం గౌతమ్ మాకు ప్రేమను, ఆనందాన్ని రెట్టింపు చేస్తూనే ఉన్నాడు..తల్లిదండ్రులుగా మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే మై డార్లింగ్ సన్, ఐ లవ్ యూ అని ప్రేమతో విషెస్ తెలిపారు. మరోవైపు మహేష్ అభిమానులు కూడా గౌతమ్ కు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియచేస్తున్నారు.
ఇక లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న మహేష్ ఈ సమయాన్ని తన ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. గౌతమ్, సితార లతో తాను కూడా ఆటలు, అల్లరి చేస్తూ టైం స్పెండ్ చేస్తున్నాడు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నమ్రత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: