కొరటాల దర్శకత్వంలో మెగా స్టార్ చిరు నటిస్తున్న ఆచార్య సినిమా ఎప్పుడూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. రెండుమూడు రోజుల క్రితమే ఈ సినిమా కథపై ఆరోపణలు వచ్చాయి. వాటికి చిత్రయూనిట్, కొరటాల క్లారిటీ ఇచ్చారనుకోండి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రపై కూడా క్లారిటీ వచ్చేసింది రీసెంట్ గానే. ఓఇంటర్వ్యూ లో పాల్గొన్న రామ్ చరణ్ తాను ఈ సినిమాలో నటిస్తున్నట్టు.. ఇన్నేళ్ల తర్వాత తన తల్లి కోరిక తీరుతున్నట్టు చెప్పాడు. ఇక ఇదిలా వుండగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిజానికి కరోనా లేకపోతే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేది. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కనుక లేకపోతే దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది. ఇప్పుడు షూటింగ్ జరుపోకడానికి అనుమతులు ఉన్నా షూటింగ్ లు చేయలేని పరిస్థితి. మరి షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో.. మిగతా 60 శాతం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి.
అయితే, సినిమా విడుదల తేదీని నిర్మాతలు లాక్ చేసినట్టు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 9 న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారట. ఇప్పటివరకూ ఏప్రిల్ 9 రిలీజ్ అయిన అన్ని సినిమాలు దాదాపు హిట్ అవ్వడంతో ఇప్పుడు ‘ఆచార్య’ను కూడా ఏప్రిల్ 9న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే దర్శక నిర్మాతల్లో ఎవరో ఒకరు క్లారిటీ ఇచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: