కేవలం సినిమా అప్ డేట్స్.. వ్యక్తిగత విషయాలు, ఫొటోస్, వీడియోస్ మాత్రమే కాదు పలు ముఖ్యమైన విషయాలను కూడా మెగా స్టార్ చిరు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. ఈరోజు మదర్ థెరీసా పుట్టినరోజు సందర్భంగా ఆమెను గుర్తుచేసుకున్నారు చిరంజీవి. తన ట్విట్టర్ ద్వారా ఆమెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ.. `మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్లినా ప్రేమను పంచాలి.. మదర్ థెరీసా 110వ జన్మదినోత్సవం సందర్భంగా గొప్ప మాతృమూర్తిని గుర్తు చేసుకుంటున్నా. ఆమె చూపించిన స్వార్థరహిత ప్రేమ, మానవత్వం ఈ ప్రపంచాన్నే హీల్ చేస్తుంది అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మనం మాట్లాడే ప్రతి పలుకు ప్రేమతో ఉండాలి. Spread love wherever you go – #MotherTeresa
Remembering the Great Mother, my guiding light #OnThisDay on her 110th Birth Anniversary. Her message of selfless Love & Caring for humanity alone can heal this world. pic.twitter.com/2Vq8YolHxj
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 26, 2020
మిషనరీస్ అఫ్ ఛారిటీ పేరుతో 45 సంవత్సరాల పాటు ప్రపంచ వ్యాప్తంగా పేదలకు,రోగగ్రస్తులకూ, అనాథలకూ ఎనలేని సేవ చేసిన మనవతా మూర్తి మదర్ థెరీసా. ఇప్పుడు ఇన్ని మిషనరీస్ నడుస్తున్నాయంటే ఒక రకంగా ఆమె స్పూర్తే కారణమని చెప్పొచ్చు.
ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా.. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను చిరంజీవి పుట్టినరోజున రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: