లాక్ డౌన్ కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావుడి అనేది లేకుండా పోయింది. ఎప్పుడు ఏదో ఒక సినిమా ఓపెనింగ్ అంటూనో.. ఆడియో రిలీజ్ అంటూనే.. సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ ఇలా నిత్యం హడావుడి.. బిజీ బిజీ గా ఉంటుంది. కానీ కరోనా వల్ల పరిస్థితి మారిపోయింది. సెలబ్రిటీస్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఇంట్లోనే ఉన్న అల్లు అర్జున్ తాజాగా తమ గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్ కు వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీస్కు వెళ్లిన బన్నీ అక్కడ తీసుకున్న ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు.చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. ఎలాంటి హడావిడి లేదు. మళ్ళీ పాత రోజులు వస్తాయని భావిస్తున్నాను.. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని బన్నీ ట్వీట్ చేశాడు. అయితే బన్నీ పిక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. రెడ్ కలర్ టీ షర్ట్, డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో చాలా స్టయిలిష్ గా కనిపిస్తున్న అల్లు అర్జున్ లుక్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
Casually dropped in Geetha Arts after a long time . I miss the hustle . Wishing for these tough times to end soon . #besafe pic.twitter.com/fUu20dABr5
— Allu Arjun (@alluarjun) August 20, 2020
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. లాక్ డౌన్ అయిపోగానే షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేత పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: