దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని.. వీలైనన్ని ఎక్కువ ఇండియన్ బ్రాండ్స్ను వాడాలని, ప్రోత్సహించాలని ‘గో లోకల్ బీ వోకల్’ నినాదానికి అల్లు శిరీష్ తెరలేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు తాను సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన కొన్ని భారతీయ బ్రాండ్లను… వాటి పేర్లను చెబుతూ..దేశీ ఉత్పత్తులు వాడటమే కాదు వాటి గురించి మన నోటితో చెప్పాలి. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. గో లోకల్ బీ వోకల్ అంటూ గతంలో ట్వీట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తనతో పాటు తన సహా నటులకు కూడా మనదేశ ఉత్పత్తులే వాడాలని కోరుతున్నారు. దీనిలో భాగంగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, రకుల్ ప్రీత్, అను ఇమ్మానుయేల్, రాశి ఖన్నా, అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ రెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఇలా తన సన్నిహితులకు.. మన ఇండియన్ బ్రాండ్స్ కు సంబంధించిన కొన్ని ఐటమ్స్ ను గిఫ్ట్ హంపర్స్ పంపించి, వారిని కూడా ఈ గో లోకల్ బీ వోకల్ ఉద్యమం లో పాల్గొని దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా కోరారు. ఇక అల్లు శిరీష్ పంపిన గిఫ్ట్ హంపర్ అందుకోవడమే కాకుండా ఇలాంటి అద్భుతమైన మూమెంట్ కి నాంది పలికిన అల్లు శిరీష్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ వేదికగా అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: