టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఎస్పీ బాలుకు కూడా కరోనా సోకిన సంగతి కూడా విదితమే. కరోనా పాజిటివ్ రావడంతో గత పదిరోజులుగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఎస్పీ బాలు ఆరోగ్యం బాగా క్షీణించిందని ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం. ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ కూడా తన తండ్రి ఆరోగ్యంపై స్పందించి… ఎస్పీ బాలు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వదంతులను నమ్మొద్దని కోరారు. ఒకట్రెండు రోజుల్లో నాన్నగారు కోలుకుంటారని తెలిపారు. దీనితో టాలీవుడ్ సినీ ప్రముఖులు బాలు తొందరగా కోలుకోవాలని ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా సూపర్స్టార్ రజినీకాంత్ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఎస్పీబీ కోలుకోవాలని తెలిపారు. ఐదు దశాబ్దాలకు పైగా భారతదేశంలోని పలు భాషల్లో తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో వేల పాటలు పాడి కోట్లాది మంది అభిమానులను అలరించిన బాలసుబ్రహ్మణ్యంగారు ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని తెలిపారు రజినీకాంత్.
Get well soon dear Balu sir pic.twitter.com/6Gxmo0tVgS
— Rajinikanth (@rajinikanth) August 17, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: