రేణు దేశాయ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రేణు దేశాయ్ ఆ తర్వాత మళ్ళీ పవన్ తో జానీ సినిమా చేశారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత పవన్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు విడిపోయారనుకోండి. అది వేరే స్టోరీ. అయితే ఒక్క హీరోయిన్ మాత్రమే కాదు రేణు దేశాయ్ లో ఇంకా చాలా కోణాలే వున్నాయి. క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేశారు, డైరెక్టర్, రచయిత్రి మరి ఎన్నో కవితలు కూడా రాసింది. అంతేకాదు సామజిక సేవ చేయడంలో కూడా రేణు దేశాయ్ ముందుంటుంది. తనకు ఉన్నంతలో పలువురికి సాయం చేస్తుంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురు, కొడుకు విశేషాలను తెలుపుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తన సోషల్ మీడియా ద్వారా మరో ఇంట్రెస్టింగ్ విషయం చెపుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెట్రోల్ డీజిల్ కార్లు వాడటం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా డిజీల్, పెట్రల్తో నడిచే వాహనాల వినియోగాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో తన రెండు లగ్జరీ కార్లను అమ్మేసి.. ఎలక్ట్రికల్ కారును కొన్నట్టు తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొన్నారు. దీనికి గల కారణాన్ని రేణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మారిష్లో జరిగిన చమురు లీకేజీ గురించి చదివిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపింది. పీల్చేగాలిలో కార్బన్ శాతం పెరిగిపోతుందని..ఇందుకుగాను తన వంతు బాధ్యత వహిస్తూ.. తన దగ్గర ఉన్న రెండు లగ్జరీ కార్లను అమ్మేసినట్టు చెప్పింది. అంతేకాదు ప్రతిఒక్కరు పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల వాడకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. మరి నిజంగా రేణు తీసుకున్న నిర్ణయం గొప్పదనే చెప్పాలి. మరి అలాంటి నిర్ణయం అందరూ తీసుకోవాలంటే కష్టమే మరి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: