తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. హీరోయిన్ రకుల్ ప్రస్తుతం “ఎటాక్ “, “ఛలే ఛలో”(హిందీ ), “అయిలాన్ “, “ఇండియన్ 2″(తమిళ ), ఒక తెలుగు మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు రకుల్ ఇన్ స్టా గ్రామ్ లో 15 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్ బాబు , అల్లు అర్జున్ , ప్రభాస్ , విజయ్ దేవరకొండ ల కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ ను రకుల్ స్వంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా రకుల్ తన ఫాలోవర్స్ కు ఒక వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. వర్క్ , స్కిల్స్ , సోషల్ మీడియా వంటి వాటి పై అంతగా అవగాహన లేని చిన్న వయసులో వర్క్ ప్రారంభించానని , మీరు అందరూ సపోర్ట్ చేశారని, తనపై అపార ప్రేమ , అభిమానం చూపించారని , దానికి తాను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటానని , ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని అలరిస్తానని వాగ్దానం చేస్తున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని రకుల్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: