మొదటి సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి. ఆర్ఎక్స్ 100 మూవీతో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పటివరకూ మరే సినిమాను డైరెక్ట్ చేయలేదు. మరోపక్క ఆర్ఎక్స్ 100లో నటించిన కార్తికేయ, పాయల్ మాత్రం వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ సినిమా తర్వాత మహాసముద్రం సినిమా అనుకున్నాడు. అయితే దానికి హీరో సెట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది అజయ్ భూపతికి. ఫైనల్ గా శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో శర్వా పాత్రపై ఆసక్తికర విషయం ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహాసముద్రంలో శర్వాను కాస్త నెగటివ్ గా చూపించబోతున్నాడట అజయ్ భూపతి. మరి మొదటి సినిమాలో హీరోయిన్ ను నెగటివ్ షేడ్ లో చూపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు నెగెటివ్ షేడ్ లో నటించిన పాయల్ కు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. మరి ఇప్ప్పుడు శర్వాను చూపించబోతున్నాడు. శర్వా గురించి తెలిసిందే. ఏ పాత్ర అయినా అందులో ఒదిగిపోయి చేయగలిగే నటుడు. మరి చూద్దాం ఈ సినిమాతో అజయ్ భూపతి సక్సెస్ ను దక్కించుకుంటాడో? లేదో?
ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీనితోపాటు శర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమాచేస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్.ఆర్.ప్రకాశ్బాబు, ఎస్.ఆర్.ప్రభు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: