సుజీత్ దర్శకత్వంలో శర్వానంద్, రత్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ‘రన్ రాజా రన్’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘రన్ రాజా రన్’ సినిమా తర్వాత శర్వా సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. ఇక ఈ సినిమా నేటితో 6ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో హీరో అయిన శర్వా.. సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
❤️❤️❤️❤️❤️❤️ pic.twitter.com/vRkQxtx9Yn
— Sharwanand (@ImSharwanand) August 1, 2020
It’s been 6 Years for Blockbuster #RunRajaRun… A big thanks to everyone who’ve been a part of the film. It’ll always be a special film in our banner.#6YearsForRunRajaRun @ImSharwanand @IamSeeratKapoor @AdiviSesh @sujeethsign @GhibranOfficial @Madhie1 @UV_Creations pic.twitter.com/HXiviBub5c
— UV Creations (@UV_Creations) August 1, 2020
కాగా ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా శర్వా సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “మహాసముద్రం ” సినిమాను లైన్ లో పెట్టాడు. వీటితోపాటు శర్వానంద్ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై శ్రీకార్తీక్ దర్శకత్వంలో ఒక సినిమాచేస్తున్నాడు. తెలుగు, తమిళ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్.ఆర్.ప్రకాశ్బాబు, ఎస్.ఆర్.ప్రభు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇవి కాక ‘రన్ రాజా రన్’ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ మరో శర్వా తో మరో సినిమా ప్లాన్ చేసింది. శ్రీరామ్ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు అయ్యాక ఈ సినిమా చేయనున్నాడని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: