టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్ ఎవరంటే కృషవంశీ అని టక్కున చెప్పేస్తాం. లవ్ ,క్రైమ్,ఫ్యాక్షన్, రివల్ల్యూషన్, ఫ్యామిలీ, ఫాంటసీ, పాట్రియటిక్ ,ఫీల్ గుడ్, మెసేజ్ ఓరియంటెడ్ ….ఇలా అన్ని రన్నింగ్ జోనర్స్ లో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిమ్స్ తీసిన అరుదైన ఘనత కృష్ణవంశీ కి దక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కెమెరా అసిస్టెంట్ గా ప్రారంభమైన కృష్ణవంశీ సినీ కెరీర్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్.. ఆ తర్వాత డైరెక్టర్ గా ఎదిగారు. ‘గులాబి’ సినిమాతో డైరెక్టర్ గా వెండి తెరకు పరిచయమై.. తొలి చిత్రంతోనే నంది అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత నాగార్జునతో ‘నిన్నేపెళ్లాడతా’ సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించగా.. ఆ సినిమా కూడా సూపర్ హిట్. అంతేకాదు ఈ సినిమాకు కూడా ఉత్తమప్రాంతీయ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సింధూరం సినిమా అయితే ఏడు నంది అవార్డుల్లో ఏడింటిని కైవసం చేసుకుని కృష్ణవంశీ సత్తా ఏంటో చూపించింది. చాటింది. జాతీయఅవార్డు కూడా సొంతం చేసుకుంది. తన కెరీర్ లో ఇప్పటివరకూ ఉత్తమ దర్శకుడిగా ఏడు నందులు అందుకున్నాడు. అంత:పురం సినిమాతో ఫాక్షనిజంలోని కొత్త కోణాన్ని చూపిస్తూ సక్సెస్ సాధించాడు కృష్ణవంశీ. ఖడ్గం సినిమాతో దేశభక్తి అంటే ఎలా ఉండాలో చూపించాడు. మహేష్ బాబుకు మురారితో కమర్షియల్ హిట్.. ప్రభాస్ కెరీర్ లో భిన్నమైన చిత్రంగా ‘చక్రం’, ఎన్టీఆర్ కు ‘రాఖీ’ లాంటి సినిమాలు అందించాడు. ఇక కాజల్ ను చందమామ సినిమాతో టాలీవుడ్ చందమామ చేసేశాడు. ఇక చందమామ తర్వాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయాడు కృష్ణవంశీ.
ప్రస్తుతం నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
ఇక ఈ రోజు కృష్ణవంశీ పుట్టిన రోజు సందర్భంగా కృషవంశీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ముందు ముందు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని.. మళ్లీ సూపర్ హిట్స్ తో దూసుకుపోవాలని కోరుకుందాం. ఈ సందర్భంగా ఆయన చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలపండి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: