టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ లిస్ట్ తగ్గిపోతుంది. ఈలిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రానా, నితిన్ ఇద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతన్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మెగా కుటుంబంలో ముందు వరసలో ఉన్న చరణ్, బన్నీ పెళ్లి చేసుకున్నారు. వరుణ్, శిరీష్ ల పెళ్ళిళ్లకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు ముందు వరుసలో కనపడుతుంది సాయి తేజ్ ఒక్కడే. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒకటే గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం కూడా ఇక కష్టమేనని ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా తను రిలేషన్ లేకపోవడానికి కారణం ఏంటో చెప్పాడు సాయి తేజ్. ఏదైనా రిలేషన్ లో ఉంటే ఎక్కువ టైం వారితోనే గడపాలని.. ఇప్పుడు కెరీర్ మాత్రమే ముఖ్యం.. ఈ షూటింగ్స్, సినిమాలు అంటూ బిజీగా ఉంటాం.. ఈ టైంలో రిలేషన్ ఉండటం అంటే కష్టం.. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లిచేసుకుంటా అని చెపుతున్నాడు. మరి వచ్చే ఏడాది అయినా పెళ్లి పీటలు ఎక్కే ఛాన్స్ ఉందొ లేదో? చూద్దాం..?
‘చిత్రలహరి’, ‘ప్రతిరోజు పండగే’ సినిమాలతో హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న సాయి తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ కరోనా రావడం వల్ల సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటు ఇటీవలే మరో సినిమాను లైన్ లో పెట్టాడు జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా సినిమా రూపొందనుంది. నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: