హైదరాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ పై రకుల్ ప్రీత్ ప్రశంసలు కురిపించారు. పోలీస్ సేవలకు సలాం అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకు పరిమితం అయితే , ప్రజల ప్రాణ రక్షణ కై 24 గంటలూ పోలీసులు తమ విధులను నిర్వహించిన విషయం తెలిసిందే. వారిలో కొంతమంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. కరోనా వ్యాధి నుండి కోలుకుని తిరిగి విధులలో చేరిన పోలీసులను రకుల్ కొనియాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే రకుల్ ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి వ్యాధి నుండి కోలుకున్న 390 మంది పోలీసులు తమ విధులలో చేరిన విషయం పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ అనౌన్స్ చేశారు. తమ ప్రాణాలను ఫణం గా పెట్టి ప్రజలకు సేవలందిస్తున్న పోలీస్ డిపార్ట్ మెంట్ కు మరింత శక్తి ని ఇవ్వమని దేవుడిని కోరుకుంటున్నానని, కరోనా ప్రజలకు కొత్త పాఠాలు నేర్పిందని, ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రజలు సానుకూల దృక్పథం తో ముందుకు సాగాలని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: