తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలీవుడ్ లోకి ‘HIT’
శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘HIT’. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నారు. బాలీవుడ్ లో కూడా శైలేషే దర్శకత్వం వహించనున్నాడు. హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా 2021 సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘సొగసు చూడతరమా’
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సొగసు చూడతరమా’ సినిమా జులై 14,2020 కి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గుణశేఖర్ దర్శకత్వంలో నరేష్, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. అంతేనా నాలుగు నంది అవార్డులను సైతం దక్కించుకుంది. బెస్ట్ ఫిల్మ్ గా బంగారు నంది ని అందుకున్న ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా గుణశేఖర్ నంది అవార్డును అందుకున్నారు. బెస్ట్ డైలాగ్ రైటర్ నంది అవార్డు ను అజయ్ శాంతి, బెస్ట్ కాస్ట్యూమ్స్ నంది అవార్డును కుమార్ తీసుకున్నారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించడమే కాదు స్వయంగా నిర్మించారు.
బాలీవుడ్ లోకి ‘మత్తు వదలరా’..?
ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ లో వచ్చిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘మత్తు వదలరా’. ఈ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నారు. రితేష్ రానా హిందీ వెర్షన్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో వున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. హిందీలో ఎవరు నటిస్తారు తదితర వివరాలు త్వరలో తెలియచేయనున్నట్టు తెలుస్తుంది.
‘లూసిఫర్’ రీమేక్ లో రెహ్మాన్
‘లూసిఫర్’ మలయాళ వెర్షన్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు రెహ్మాన్ పోషించనున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
‘లవ్ మాక్ టైల్’ తెలుగు రీమేక్ లో తమన్నా, సత్య దేవ్
కన్నడలో ‘లవ్ మాక్ టైల్’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ కు సిద్ధమైంది. సత్యదేవ్, తమన్నా జంటగా ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహించడంతో పాటు నాగ శేఖర్ మూవీస్ బ్యానర్పై నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
డీపీ మార్చిన మహేష్
ఇటీవలే మహేష్ బాబు ట్విట్టర్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక ఎన్నోయేళ్ల నుండి తన డీపీ మాత్రం మార్చలేదు. ఒకే పిక్ ను మెయిన్ టైన్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియా లో తన డిస్ ప్లే , ప్రొఫైల్ పిక్చర్స్ ను మార్చారు.
ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో సాయి తేజ్
ప్రస్థానం ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జె బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో సాయి తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. నివేత పేతురాజ్ కథానాయిక కాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: