వాళ్లు చెప్పారు.. నేను చేశాను..!

Namrata Shirodkar Shares A Message Through Her Recent Pic Posted On Social Media

సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే నమ్రత మహేష్ బాబు సినిమా సంగతులు, తమ కుటుంబ విషయాలు, పిల్లలు గౌతమ్-సితార ల అల్లరి ఆటలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ లాక్ డౌన్ లో మాత్రం నమ్రత సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ అయినా పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా తన ఇన్స్టాలో మరో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో నమ్రత గౌతమ్-సితారలతో కలిసి ఆడుతున్నట్టు ఉంది. ముగ్గురూ ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. కరోనా పై అవేర్ నెస్ గురించి మాట్లాడటం నెక్స్ట్ లెవెల్ అది.. చిన్న తుమ్ముకే మా గ్యాంగ్ ఇలా మాస్క్ తో కవర్ చేసుకోమన్నారు.. వారు చెప్పినట్టే చేశా అంటూ కాస్త కామెడీ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవడ్ లో ఉన్న క్యూట్ ఫ్యామిలీస్ లో మహేష్ ఫ్యామిలీ ఒకటి. మహేష్ ను పెళ్లి చేసుకున్న అనంతరం నమ్రత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. మహేష్ ఒక పక్క సినిమాలతో బిజీగా ఉంటే.. నమ్రత ఇంటి భాద్యతలు.. మహేష్ కు సంబంధించిన ఇతర బిజినెస్ లను చూసుకుంటుంది.

ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది ఆరంభంలోనే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ‘సర్కారు వారి పాట’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్‌ ప్లస్‌ పతాకాల సంయుక్త సమర్పణలో నవీన్‌ యర్నేని, రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − seven =