ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న టాలెంటెడ్ నటుడు మాధవన్. కేవలం తమిళ్ లోనే కాదు కూడా తెలుగు, హిందీలో కూడా నటించారు తెలుగులో కూడా మాధవన్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాధవన్ రీసెంట్గా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా పదవ తరగతిలో తాను పొందిన మార్కుల వివరాలని వెల్లడించాడు. సడెన్గా మాధవన్ తన మార్కుల వివరాలని వెల్లడించడానికి ఓ కారణం ఉంది. మాధవన్ 10వ తరగతి ఫలితాల నేపథ్యంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలు సంగతేంటంటే… ఈ నెల 15న సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాధవన్ తన ట్విట్టర్ ద్వారా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అంతేకాదు తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందొద్దంటూ ధైర్యం చెపుతున్నాడు. తన ట్విట్టర్ లో ‘సీబీఎస్సీ’ బోర్టు వెల్లడించిన ఫలితాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికి అభినందనలు. నాకు 10వ తరగతిలో 58 శాతం మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు వచ్చిన వారు నిరాశ చెందకండి. ఎందుకంటే ఆట అప్పుడే మొదలు కాలేదు మిత్రులారా’ అంటూ గురువారం ట్వీట్ చేశాడు. ఇక మాధవన్ చేసిన ఈ ట్వీట్ పై ఎంతోమంది నెటిజన్స్ స్పందించి.. విద్యార్థులు నిరాశ చెందకుండా చేస్తున్న ప్రయత్నానికి ప్రశంసలు కురిపిస్తున్నారు.
To all those who just got their board results— congratulations to those who exceeded their expectations and aced it . 👌👌👍👍.. and to the rest I want to say I got 58% on my board exams.. The game has not even started yet my dear friends ❤️❤️🤪🤪🚀😆🙏🙏 pic.twitter.com/lLY7w2S63y
— Ranganathan Madhavan (@ActorMadhavan) July 15, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: