ఇక రీమేక్ సినిమాలు చేయను..!

I Will Never Act In Remake Movies Says Actress Shruti Haasan

2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. దానికి రిలేషన్ షిప్ లో ఉండటం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా సందడి చేసింది ఈ భామ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా అభిమానులతో ముచ్చటించిన శృతి హాసన్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తను నటిస్తున్న యారా సినిమా త్వరలోనే జీ5 లో రిలీజ్ అవ్వబోతుందని చెప్పింది. ఇక వాటితో పాటు క్రాక్, లాభం అనే సినిమాల్లో నటిస్తున్నా అని చెప్పింది. ఇంకా ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటున్నారా అని అడుగగా.. ఇప్పటికే చాలా రీమేక్ లు చేశాను.. ఇంకా రీమేక్ లు చేయను అని తెలిపింది. ఇంకా పాజిటివ్ ఆటిట్యూడే తన సెల్ఫ్ మోటివేషన్ కి కారణమని.. ఎప్పుడు ఏ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవ్వలేదని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం శృతి హాసన్ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న “క్రాక్ ” మూవీ నటిస్తుంది. ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటించనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − three =