ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమా వెంకటేష్, చైతన్య ‘వెంకీమామ’ రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రాలు కూడా గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం పలు చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ లేకపోవడంతో ఇంట్లోనే కాలక్షేపం చేస్తుంది. అయితే ఈ లాక్ డౌన్ టైములో ఎన్నో విషయాలు నేర్చుకున్నా అంటుంది పాయల్ రాజ్ పుత్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈలాక్ డౌన్ లో ఎంతో మంది ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు.. నేను కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అంటుంది పాయల్. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన పాయల్.. లాక్ డౌన్ వాళ్ళ రెండు నెలలు ముంబైలోని అపార్ట్మెంట్ లోనే ఉండాల్సి వచ్చింది.. మెయిడ్ లేదు నేను ఎప్పుడు చేయని పనులు చేసాను అని తెలిపింది. అంతేకాదు మన జీవితంలో ఈ సదుపాయాలు కలిగి వున్నందుకు నిజంగా అదృష్టవంతులమనిపిస్తుంది. ఇక ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోవాళ్ళు పెంపర్ చేస్తారు.. మనకు మన కుటుంబమే అసలైన బలం అని తెలిపింది. అంతేకాదు రూల్స్ అన్నీ పాటించి షూటింగ్ చేయడం కాస్త కష్టమే.. మాస్క్ ధరించడం.. గ్లౌజ్ లు వేసుకోవడం.. శానిటైజర్ ఫ్రీక్వెంట్ గా రాసుకోవడం కాస్త ఇబ్బందే కానీ వైరస్ ను అరికట్టాలంటే ఇవన్నీ చేయక తప్పదు పాయల్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ప్రనదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో ‘5ws’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె ఐపీఎస్ రోల్ లో ఆమె నటిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా పాయల్ కు మంచి బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: