లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. రిలీజ్ కావాల్సిన ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ సినిమాలు కూడా రిలీజ్ కు నోచుకోలేదు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్కుమార్, కత్రినా కైఫ్, గుల్షన్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సూర్యవంశీ’. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అలాగే కపిల్ దేవ్ జీవితం ఆధారంగా కబీర్ఖాన్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘83’. ఏప్రిల్ 10న విడుదల కావాల్సిన ఈ సినిమా కూడా వాయిదా పడింది. 1983లో క్రికెట్లో విశ్వవిజేతగా ఆవిర్భవించిన ఇండియన్ టీమ్ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ లను ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాల రిలీజ్ డేట్ లపై క్లారిటీ ఇచ్చింది. 2020లో దీపావళి సందర్భంగా నవంబర్ 13న అక్షయ్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’.. అలాగే క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్25న రణ్వీర్ సింగ్ ప్రధానపాత్రలో నటించిన ‘83’ సినిమాను విడుదల చేస్తున్నట్లు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సీఇఓ షిభాషిస్ సర్కార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నవంబర్ 13న దీపావళికి ‘సూర్యవంశీ’, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ‘83’ చిత్రాలను థియేటర్స్లోనే విడుదల చేస్తున్నాం. పరిస్థితులు చక్కబడి ప్రేక్షకులు సినిమా థియేటర్కు రావడం ప్రారంభించిన తర్వాతే ‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. రానున్న దీపావళి, క్రిస్మస్లకు పరిస్థితులు చక్కబడతాయని ఆశిస్తున్నాం అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: