రానా దగ్గబాటి, గుణశేఖర్ కాంబినేషన్ లో “హిరణ్య కశ్యప” అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. మరోపక్క కరోనా ప్రభావం వల్ల ఇప్పుడు భారీ బడ్జెట్ పెట్టే అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇప్పుడు తీసే ఉద్దేశం లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదంటూ అప్పుడే క్లారిటీ కూడా ఇచ్చేసారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయి. ప్రస్తుతం రానా వేరే సినిమాలతో బిజీగాఉన్నాడు అవి అయిపోయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కిస్తామని అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరోసారి.. రానా-గుణశేఖర్ కాంబినేషన్ లో రానున్న హిరణ్య కశ్యప గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంత బడ్జెట్ తో తెరకెక్కించడానికి కారణం ఏమిటని అడుగగా…కొన్ని చిత్రాలకు కథ రీత్యా భారీ బడ్జెట్ అవసరం, వాటిని అలానే తీయాలి. ఇవి ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే సినిమాలు అందుకే బడ్జెట్ మరియు స్క్రిప్ట్ విషయంలో రాజీపడకుండా తెరకెక్కించాలి, అన్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులకే 15కోట్లు ఖర్చుపెట్టారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమాను రేంజ్ లో తీయనున్నారో. హాలీవుడ్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ మూవీలో నిర్మాణ భాగస్వామిగా ఉండడం విశేషం. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.
కాగా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: