గ్రీన్ ఛాలెంజ్ పూర్తి చేసిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం

Tollywood Star Comedian Brahmanandam Completes Green Challenge By Planting Few Samplings At His Home In Hyderabad

టీఆర్ఎస్‌ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభాస్, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, వీవీ వినాయక్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించి.. పలువురికి ఈ సవాల్ ను విసిరారు. ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంతోష్‌కుమార్ ప్రారంభించిన 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి బ్రహ్మానందం నేడు మణికోండ లోని తన నివాసంలో మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =