మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో గతకొద్ది రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. ముందుగా మహేష్ తో భరత్ అనే నేను చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకుంటున్నారన్న టాక్స్ వినిపించాయి. ఆ తర్వాత ‘దబాంగ్ 2’ ఫేమ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపించాయి. అందులో కూడా నిజం లేదని తెలిసింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేషే నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో మాట్లాడిన కీర్తి ఈ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పకనే చెప్పేసింది. దీనితో ఈ సినిమాలో నటించేది కీర్తి సురేషే అని కన్ఫామ్ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు మహేష్ డబుల్ ట్రీట్ అన్నట్లుగా టైటిల్తో పాటు ప్రీలుక్ను కూడా సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున విడుదల చేశారు. ఈ టైటిల్కు, ప్రీలుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రావడంతో సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయి. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: