నార్మల్ గా ఉండే జీవితాలు కరోనా వల్ల ఒక్కసారిగా మారిపోయాయి. ఒకరికొకరు దగ్గరగా మాట్లాడుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఈ వైరస్ కు మొదట ప్రజలు భయపడినా ఇప్పుడు మాత్రం కాస్త ఆ భయం తగ్గినట్టుంది. దానికితోడు ప్రభుత్వం కూడా సడలింపులు చేయడంతో ప్రజలు కూడా బయటికి వచ్చేస్తున్నారు. ఇక ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు క్రియేటివిటీతో పోస్ట్లు క్రియేట్ చేస్తుంటే కొందరు ఫన్నీగా క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఎవరి క్రియేటివిటీ వారిది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా కరోనాపై దర్శకుడు క్రిష్ కూడా తన ట్విట్టర్ లో ఒక పోస్ట్ షేర్ చేశాడు.ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే కరోనాపై వేమన పద్యాలతో ఉన్న కవితలను పోస్ట్ చేసాడు. విశ్వదాభిరామా వినుర వేమ వైరస్ పై వేమన శతకం అంటూ ఇది మా సిద్దార్థ ఫార్మసీ కాలేజీ గ్రూప్ లో వచ్చినది. దీని ఒరిజినల్ సోర్స్ ఎవరు రాశారు అనేది నాకు తెలియదు అంటూ ఈ ఫొటోను షేర్ చేశాడు. అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
విశ్వదాభిరామ వినురవేమ!
కరోనా పై వేమనశతకం
– ఇది మా సిద్దార్థ ఫార్మసీ కాలేజీ వాట్సాప్ గ్రూప్ లో వచ్చినది… Original source తెలియదు. pic.twitter.com/bhVPO5KBBK— Krish Jagarlamudi (@DirKrish) June 17, 2020
కాగా క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. జులై రెండో వారం నుండి రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన స్పెషల్ సెట్లో పవన్, క్రిష్ కాంబినేషన్ మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో పవన్ తదితరులపై పలు కీలక ఘట్టాలు తెరకెక్కించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: