లాక్ డౌన్ వల్ల ఇంటికే పరితిమితమైన సెలెబ్రిటీస్ సోషల్ మీడియా కు మాత్రం బాగానే దగ్గరయ్యారు. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులతో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా ఏఆర్ రెహ్మాన్తో కలిసి సోషల్ మీడియా లైవ్ఛాట్లో పాల్గొన్నారు. ఇక ఛాట్ లో కమల్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అందులో తన కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచిన క్షత్రియ పుత్రుడు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పారు. అదేంటంటే.. సినిమా కథను కేవలం ఏడు రోజుల్లోనే రాశాడట కమల్ హాసన్. `దేవర్ మగన్` దర్శకుడు, నా స్నేహితుడు భరతన్ నాతో సవాల్ చేశాడు. స్క్రిప్టును త్వరగా పూర్తి చేయకపోతే సినిమా నుంచి తప్పుకుంటానని బెదిరించాడు. అతి తక్కువ సమయంలో స్క్రిప్టు రాస్తానని చెప్పాను. చెప్పినట్టుగానే ఏడు రోజుల్లో మొత్తం స్క్రిప్టు సిద్ధం చేశాను అని చెప్పాడు. ఇక ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు జాతీయ అవార్డులు దక్కించుకుంది. 1992లో విడుదలైన ఈ సినిమాలో కమల్తో పాటు శివాజీ గణేషన్, రేవతి కీలకపాత్రల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం కమల్ శంకర్ దర్శకత్వంలో ‘ భారతీయుడు2’ సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా వల్ల బ్రేక్ తీసుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: