ఇండస్ట్రీ లో ఎంతో సీనియర్ డైరెక్టర్స్ దగ్గర నుండి కొత్తగా వచ్చిన యంగ్ డైరెక్టర్స్ వరకూ ఎంతో మంది ఉన్నారు. ఇక ఈ డైరెక్టర్స్ లో ఎవరి స్టయిల్ వారిది. బేసిగ్గా డైరెక్టర్స్ అందరికి అందరు హీరోలతో సినిమాలు చేసేయాలని అనిపిస్తుంది. అయితే అది కొంత మంది డైరెక్టర్స్ కు అది వర్క్ అవుట్ అయినా కొంతమందికి మాత్రం కాదు. ఒకప్పుడు అంటే కుదిరేదేమో కానీ ఇప్పుడున్న పరిస్థితులు.. ఇప్పుడున్న పోటీ వాతావరణం.. కొత్త కొత్త డైరెక్టర్స్ రావడం ఇలాంటి పరిస్థితుల్లో కష్టమైన విషయమే. కానీ కొంతమంది డైరెక్టర్స్ కు మాత్రం కొంతమంది హీరోలతో మాత్రం సినిమా తీయాలనే కోరిక ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్ అయితే తమ అభిమాన హీరోను డైరెక్ట్ చేయాలన్న కలతోనే డైరెక్టర్ గా మారిన వారు కూడా వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా చిరు, బాలకృష్ణ తో సినిమా తీయాలన్నది ఎప్పటినుండో ఉన్న కోరిక అని చెపుతున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కమర్షియల్ సినిమాల ఎక్స్పర్ట్ గోపీచంద్ మలినేని. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మాట్లాడుతూ.. తాను చిరంజీవి, బాలకృష్ణ కు పెద్ద ఫ్యాన్ అని.. వారిని డైరెక్ట్ చేయాలన్నది తన కోరిక అని అన్నారు. అంతేకాదు త్వరలోనే ఓ స్టార్ హీరోకు కథను వినిపించనున్నానని.. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నట్టు తెలిపారు. చూద్దాం మరి గోపీచంద్ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో.
కాగా ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా చేస్తున్న ‘క్రాక్’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. మరో 10రోజుల షూట్ మాత్రమే పెండింగ్ ఉందని ఇటీవలే తెలియచేసాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. కరోనా వల్ల ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: