వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ఈ ఏడాది మొదట తూట అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ వెంటనే మరో సినిమాతో వచ్చాడు. ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో `పటాస్` పేరుతో ఓ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కింది. ధనుష్ ద్విపాత్రాభినయంలో.. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ సూపర్ హిట్ టాక్నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ‘కర్ణన్’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. దానితో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న ‘జగమే తంత్రం’. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం గతంలో తాను మొదలుపెట్టిన సినిమాను ధనుష్ మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా ఏదో కాదు.. రెండేళ్ల క్రితం ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ‘నాన్ రుద్రన్’ భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రారంభించాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఆ ప్రాజెక్టును మళ్లీ సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట ధనుష్. కొంచెం బడ్జెట్ తగ్గించి ప్లాన్స్ వేసి.. సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ ని కొత్తగా రెడీ చేసేందుకు ధనుష్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో అధితీరావు హైదరీ, శరత్ కుమార్ కీలక పాత్రలు చేస్తున్నారు.
ఇక కింగ్ నాగార్జున తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. దానితో పాటు.. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: