మల్టీ ట్యాలెంటెడ్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. “అనగనగా ఓ ధీరుడు ” మూవీ తో శృతి హాసన్ టాలీవుడ్ లో అడుగు పెట్టారు. శృతి నటించిన “గబ్బర్ సింగ్ “, “బలుపు “, “ఎవడు “, రేసుగుర్రం “, “శ్రీమంతుడు ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. శృతి ప్రస్తుతం తెలుగు లో రవితేజ హీరోగా రూపొందుతున్న “క్రాక్ ” , విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న “లాభం ” (తమిళ) మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో శృతి 14 మిలియన్ ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇన్ స్టా గ్రామ్ లో 14 మిలియన్ ఫాలోవర్స్ మైలు రాయి ని చేరుకొనడం సంతోషంగా ఉందని , ప్రతీ రోజూ అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ , అభిమానం కు థ్యాంక్స్ అని , తన జీవిత విశేషాలు అభిమానులతో పంచుకొనడం అద్భుతం అనిపిస్తుందని , తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో శృతి హాసన్ షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: