ఒకపక్క లాక్ డౌన్ వల్ల సినిమా పరిశ్రమకు అసలే కష్టాలు వచ్చిపడ్డాయి. దానికితోడు వరుసపెట్టి పలు ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్ననే కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్ కింగ్’ అర్జున్కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా నిన్న మధ్యాహ్నం మృతి చెందాడు. ఇక మరో ప్రముఖ నటుడు మురళీ శర్మకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి శ్రీమతి పద్మ శర్మ గారు గత రాత్రి ముంబైలోని స్వగృహంలో గుండె పోటుతో ఆకస్మిక మృతి చెందారు. ఆమె వయస్సు 76 సంవత్సరాలు. వయసు రీత్యా ఆమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నిన్న కన్నుమూశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పద్మ శర్మ గారిది తెలుగు కుటుంబమే. ముంబైలో స్థిరపడిన తెలుగు కుటుంబం మురళీ శర్మది. ఆయన తండ్రి వృజ్ భూషణ్ మరాఠీ కాగా తల్లి పద్మగారిది గుంటూరు. తండ్రి వ్యాపారరీత్యా వారు ముంబయిలో స్థిరపడ్డారు. ఇక విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మురళీ శర్మ. విలన్గా, తండ్రిగా, పోలీస్ ఆఫీసర్గా అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిధి’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే నంది అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాదితో పాటు హిందీలో వందకు పైగా చిత్రాల్లో నటించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: