ప్రభుదేవా-నయనతార ఈ కాంబినేషన్ పై అప్పుడెప్పుడో వాళ్ళు ప్రేమలో వున్నప్పుడు వార్తలు వచ్చాయి. మళ్ళీ ఇన్నేళ్లకు వీరిద్దరి పేర్లు వార్తల్లో నిలిచాయి. అయితే ఈ సారి విషయం వేరే అనుకోండి. ఇంతకీ వీరిద్దరి పేర్లు వార్తల్లో రావడానికి కారణం ఏంటబ్బా అనే కదా డౌట్ .. అసలు విషయం తెలుసుకోవాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రభుదేవా దర్శకత్వంలో రెండేళ్ల క్రితం ‘కరుప్పు రాజా వెళ్లై రాజా’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. విశాల్, కార్తి హీరోలుగా మొదలైన ఈ సినిమా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు తెరపైకి వచ్చింది. మళ్ళీ ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారని.. అంతేకాదు ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహిస్తూనే నటించనున్నారని.. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించనున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన ఈ చిత్రానికి నిర్మాత అయిన ఇశారీ కె గణేశ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘కరుప్పు రాజా వెళ్లై రాజా’ చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలిసి నటిస్తారని వినపడుతున్న వార్తల్లో నిజం లేదు. ‘కరుప్పు రాజా వెళ్లై రాజా’ చిత్రం అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఆ సినిమాను పూర్తి చేయాలని ఉద్దేశం నాకు ఇప్పుడు లేదు’’ అన్నారు. మరి ఈ క్లారిటీతో ఈ రూమర్లకు చెక్ పదతదేమో చూద్దాం.
ఇదిలా ఉండగా ప్రస్తుతం నయన్ ‘మూక్కుత్తి అమ్మన్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో తొలిసారి దేవత పాత్రలో కనిపించనుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని స్టిల్స్ను నయనతార సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి ‘మూక్కుత్తి అమ్మన్ సెట్లో’ అని రాసుకొచ్చారు. ఇక అమ్మవారిగా నయనతార సరిగ్గా సరిపోయిందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చూద్దాం మరి ఈ పాత్రలో నయన్ ఎలా అలరిస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: