టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న రకుల్ వర్క్ అవుట్స్, ఫోటో షూట్స్ , ఫుడ్ , మూవీ విశేషాలు వంటి విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. కరోనా కారణం గా లాక్ డౌన్ బాధితులకు తన వంతు సాయం అందించిన రకుల్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పి ఎమ్ కేర్స్ ఫండ్ కు డైవర్ట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా రకుల్ ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్ కు చేరుకుంది. ఈ సందర్భంగా రకుల్ స్పందిస్తూ … తన ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 14 మిలియన్ కు చేరుకొన్నందుకు హ్యాపీ గా ఉందని , మాటల్లో చెప్పలేని చాలా విషయాలు ఫొటోస్ ద్వారా వ్యక్త పరచవచ్చని , ఈ సంతోష సమయంలో ఏం మాట్లాడాలో తెలియడం లేదని, తాను ఆనందంగా ఉన్నప్పుడు తన ఫీలింగ్స్ ఇలాగే ఉంటాయని కొన్ని ఫొటోస్ ను రకుల్ షేర్ చేశారు. తెలుగు లో నితిన్ హీరో గా రూపొందుతున్న మూవీ, తమిళ భాషలో “ఇండియన్ 2” మూవీ లో రకుల్ నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: