ఒకదాని తర్వాత ఒకటి మహేష్ బాబు ఫ్యాన్స్ కు సర్పరైజ్ ఇస్తున్నారు. రేపు ఆయన తన అభిమానులతో ముచ్చటించనున్నట్టు ఇప్పటికే తెలిపారు. రేపు సూపర్ కృష్ణ పుట్టినరోజు కావడంతో మహేష్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్స్ లో పాల్గొననున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటల నుండి ఈ కార్యక్రమం మొదలుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సంతోషంలో ఉండగానే మరో అప్ డేట్ ఇచ్చారు. ఇన్ని రోజులు మహేష్ తర్వాత సినిమా పరుశురాంతో అన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పరుశురాంతో అని అంటున్నారు కానీ అధికారిక ప్రకటన అయితే లేదు. ఇప్పుడు ఆ డౌట్లన్నిటికీ తెరదించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మహేష్ తో 27వ సినిమా పరుశురాం తోనే అని ప్రకటించారు. అంతే కాదు ఇప్పటికే దీని గురించి అనేక సంగతులు వింటున్నారని, అసలు విషయం తెలుసుకునేందుకు కౌంట్ డౌన్ మొదలైందని ట్వీట్ చేశారు. మే 31 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు అసలు విషయం చెబుతామని తెలిపారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
We’re back together with our Superstar 😍 #SSMB27 Official Announcement 🥁
You’ve been hearing a lot about it, countdown begins to see the REAL thing 😊
31st May – 9.09 AM 🌠@urstrulyMahesh @ParasuramPetla @GMBents @14ReelsPlus pic.twitter.com/oRwDHQxUVw
— Mythri Movie Makers (@MythriOfficial) May 30, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: