పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో ఓ పిరియాడిక్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల కాలం నాటి వాతావరణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే కొంత చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి.. కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ పరంగా బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, జులై రెండో వారం నుండి రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన స్పెషల్ సెట్లో పవన్, క్రిష్ కాంబినేషన్ మూవీకి సంబంధించి నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్లో పవన్ తదితరులపై పలు కీలక ఘట్టాలు తెరకెక్కించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: