శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 23 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2’ ను తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాకు మొదటినుండి పలు అడ్డంకులే ఎదురయ్యాయి అని చెప్పొచ్చు. వాటన్నిటిని తట్టుకొని ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను జరుపుకోగా.. లాక్డౌన్కు ముందు షూటింగ్ స్పాట్లో జరిగిన ప్రమాదం కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా వచ్చి పడి ఇంకా పెద్ద బ్రేక్ పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు చిత్రయూనిట్ మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. క్రేన్ ప్రమాదం జరిగిన పూందమల్లి సమీపంలోని స్టూడియో నుంచి లొకేషన్ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై విమానాశ్రయం సమీపంలోని బిన్నీ మిల్లులో సెట్ వేసి చిత్రీకరణ చేయనున్నట్లు కోలీవుడ్ టాక్.
కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్, ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్, విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిజానికి ఈ సినిమాను తమిళ సంవత్సరాది సందర్భంగా 2020 ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ అది కుదరలేదు. మరి చూద్దాం ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: