‘మహానటి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో ‘మిస్ ఇండియా’.. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ‘పెంగ్విన్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ లో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఆ మధ్య కీర్తి సురేష్ బరువు తగ్గి స్లిమ్ అయిన సంగతి తెలిసిందే. మొదట కీర్తి సురేష్ ను చూసి అందరూ షాకైన ఆ తర్వాత స్లిమ్ అయినా బానే వుంది అనుకున్నారు. అయితే కీర్తి సురేష్ సన్నబడటం పై పలు కథనాలు వచ్చాయి. కీర్తి ఎక్స్ పోజింగ్ చేసేందుకే సన్నబడింది అని పలు రకాల వార్తలు వచ్చాయి. ఇక ఈ కథనాలపై కీర్తి సురేష్ స్పందించి సీరియస్ అయ్యారు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తనపై వచ్చిన ఈ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని కొట్టిపారేశారు. తాను బరువు తగ్గింది సినిమాలలో కాస్త స్లిమ్ గా కనిపించడానికి తప్ప ఎక్స్ పోజింగ్ రోల్స్ లో కనిపించడానికి కాదు అన్ని ఘాటుగానే సమాధానం చెప్పారు.
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ ఆ తర్వాత నేను లోకల్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాతో ఒక్క సారిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నది. అంతే ఈ సినిమాకు గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: