స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో తొలి పాన్ – ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రావాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. లాక్ డౌన్ అనంతరం మలి షెడ్యూల్కి సన్నద్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ చిత్రాన్ని ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్గా రూపొందించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. తొలుత థాయిలాండ్ తదితర విదేశీ ప్రాంతాల్లో నిర్మాణం జరపాలని యూనిట్ భావించింది. అయితే కరోనా ఎఫెక్ట్తో ఆ ఆలోచనని విరమించుకుని.. పూర్తి స్థాయిలో భారత్లోనే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట.
మరి.. ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ ప్రాజెక్ట్ ఏ స్థాయిలో మురిపిస్తుందో తెలియాలంటే వచ్చే వేసవి వరకు వేచి చూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: