సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే ఆ సినిమా కాస్టింగ్ లో విదేశీ నటీనటులు, టెక్నిషియన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ ఓ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు కానీ.. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీయనున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? ఆ సినిమా ఏదో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న ‘పుష్ప’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలు సంగతేంటంటే.. కరోనా వల్ల ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినిమా షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఒక వేళ లాక్ డౌన్ తీసేసినా కూడా షూటింగ్ లు అయితే జరుగుతాయి కానీ.. విదేశీయులు ఇక్కడికి రావడం కష్టమే. అంతేకాదు విదేశీయులను ఇక్కడకు రప్పించడానికి మేకర్స్ ఆలోచిస్తున్నారు. అలాగే మన వాళ్లు విదేశాలకు వెళ్లడానికి ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే పుష్ప చిత్రాన్ని మేడిన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందించాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో ఇందులో నటించే నటీనటులే కాదు.. ఈ సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణులు కూడా మన దేశానికి చెందినవారినే తీసుకోనున్నారట. ఈ రకంగా పుష్ప మరో రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: