ప్రభాస్ 20 సినిమానే ఇంకా పూర్తికాలేదు కానీ ప్రభాస్ 21 సినిమాపై మాత్రం రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వస్తూనే ఉంది. నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో భారీ కాస్టింగ్ నే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామిని తీసుకోవాలనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. పాన్ వరల్డ్ గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో.. ఈ సినిమాకు స్టార్ క్యాస్ట్ సైతం భారీగా ఉండనుందట. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను ఈ సినిమా కోసం తీసుకోనున్నారట. అలాగే వివిధ సాంకేతిక విభాగాలకు సంబంధించి హాలీవుడ్ నిపుణులను తీసుకోనున్నారట. మరి ఇప్పుడే ఈ సినిమాకు ఇంత బజ్ ఉంటే ముందు ముందు ఎంత ఉంటదో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగాప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: