నాగార్జున ‘సంతోషం’కు 18 ఏళ్ళు

Akkineni Nagarjuna Wholesome Family Entertainer Santosham Completes 18 Years

‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో పలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. వాటిలో ‘సంతోషం’ ఒకటి. ఫ్యామిలీ మూవీస్ స్పెషలిస్ట్ దశరథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియ నాయకానాయికలుగా నటించారు. “కళాతపస్వి” కె.విశ్వనాథ్, ప్రభుదేవా, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, సునీల్, పృథ్వీ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, ‘ఆహుతి’ ప్రసాద్, సుమిత్ర, సుధ ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి ఆర్.పి.పట్నాయక్ బాణీలు అందించగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, కులశేఖర్, విశ్వ, చంద్రసిద్ధార్థ సాహిత్యం సమకూర్చారు. “నే తొలిసారిగా”, “దేవుడే దిగివచ్చినా”, “నువ్వంటే నాకిష్టమని”, “దిందినక్తరి”, “ఏమైందో ఏమో నాలో”, “సో మచ్ టు సే”, “డిరిడిరిడిరిడీ వారెవ్వా”, “మెహబూబా మెహబూబా”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకాదరణ పొందింది. ఉత్తమ తృతీయ చిత్రం, ఉత్తమ నటుడు(నాగార్జున) విభాగాల్లో ‘నంది’ పురస్కారాల్ని అందుకోవడమే కాకుండా.. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (ఆర్.పి.పట్నాయక్) కేటగిరీల్లో ‘ఫిల్మ్ ఫేర్’ అవార్డుల‌ను కూడా సొంతం చేసుకుందీ చిత్రం. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. 2002 మే 9న విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘సంతోషం’.. నేటితో 18 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =