“కిక్ “, “ఎవడు “, రేసు గుర్రం “, “టెంపర్ “వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ “నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ” మూవీ తో దర్శకుడిగా మారారు. ఆ మూవీ పరాజయం పొందడంతో దర్శకుడిగా వంశీ కి అవకాశాలు రాలేదు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కై ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను వంశీ రెడీ చేస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ రైటర్ వంశీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడం తో మాస్ మహారాజా రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయడంలో వంశీ బిజీగా ఉన్నారని , ఎలాగైనా హిట్ సాధించి దర్శకుడిగా సెటిల్ అవడానికి వంశీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హీరో రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: