కరోనా నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు…రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. వాటితో పాటు పేదలకు అండగా నిలుస్తూ ఉదారత చాటుకుంటున్నారు చాలా మంది ప్రముఖులు. కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు.. సామాన్య ప్రజలు కూడా తమ స్థోమతకు తగిన విధంగా సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సినీ కార్మికుల కోసం చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సాయం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన దగ్గర పని చేసే వారికి కూడా కొండంత అండగా నిలిచారు. ఎన్టీఆర్ తన దగ్గర పని చేసే స్టాఫ్తో పాటు వారి కుటుంబాలకి అండగా నిలిచారు. స్టాఫ్ అందరికి అడ్వాన్స్ వేతనం అందించిన ఎన్టీఆర్ .. రానున్నరోజులలో కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చిన కూడా మీ అందరికి నా అండ తప్పక ఉంటుందని భరోసా ఇచ్చారట. దీనితో ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్.. RRR సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ మరో హీరో. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 80 శాతం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్డౌన్ ముగియగానే RRRతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: