‘ప్రభాస్ 20’ సినిమా ప్రారంభం గ్లిoప్స్ మీకోసం..!

ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఓపెనింగ్ కు సంబంధించిన ఫొటోలేవీ అప్పట్లో మీడియాలో రాలేదు. ఇక తాజాగా ఈ సినిమా ప్రారంభానికి సంబంధించి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా పూజా సెర్మనీ లో ఫొటోలను పోస్ట్ చేసి.. మన డార్లింగ్ ప్రభాస్ కు సంబంధించి గ్లింప్స్ అని తెలిపారు.

 

 


ఇక ఈ సినిమా తర్వాత అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇక ఈ రెండు సినిమాలు తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా వుండబోతుందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − thirteen =