సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం, అభినయం తో యూత్ ను హుషారెక్కించారు. యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న పాయల్ “వెంకీ మామ “, “డిస్కో రాజా “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం జయంత్ పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న “నరేంద్ర” మూవీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా నటిస్తున్నారు. “ఏంజెల్ ” మూవీ తో కోలీవుడ్ కు ఎంటర్ కానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి కారణంగా దేశం లో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్స్, రిలీజ్ లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కరోనా బాధితులకు సెలబ్రిటీస్ తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రజలంతా లాక్ డౌన్ ముగింపు కై ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇంటికి పరిమితం అయిన పాయల్ ఇంటిపనులతో లాక్ డౌన్ సమయాన్ని స్పెండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ ముగింపు కై ఎదురు చూస్తున్న పాయల్ ఇన్ స్టా గ్రామ్ లో తన ఫోటోను షేర్ చేసి, “టేక్ మీ అవే టు బెటర్ డేస్ ??#గుడ్ ఓల్డ్ డేస్ అంటూ కామెంట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: