వైవిధ్యభరితమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న యువ దర్శకుల్లో చందు మొండేటి ఒకరు. ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’తో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్బస్టర్స్ అందుకున్న చందు.. మూడో చిత్రంగా ‘సవ్యసాచి’ని తెరకెక్కించాడు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో స్వల్ప విరామం తరువాత ‘కార్తికేయ’కి సీక్వెల్గా ‘కార్తికేయ2’ని రూపొందించనున్నాడు చందు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ‘కార్తికేయ 2’ తరువాత తన తదుపరి చిత్రం యువ కథానాయకుడు శర్వానంద్ కాంబినేషన్లో ఉంటుందని తాజాగా చందు స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు.. 1910 – 2021 వరకు సాగే ప్రేమకథా చిత్రమిదని.. ‘మనం’ తరహాలో ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఓ మంచి చిత్రమవుతుందని చందు చెప్పుకొచ్చాడు.
మరి.. చందు, శర్వానంద్ కాంబినేషన్లో రానున్న ఈ సెమి – పిరియాడిక్ లవ్ స్టోరీ.. వీరిద్దరి కెరీర్కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: