మరణించిన సైనికులకు మౌనం పాటించి నివాళులర్పిన్నా..!

Super Star Mahesh Babu Pays Tributes To The Soldiers Who Lost Their Lives In Handwara Terrorist Attack
Super Star Mahesh Babu Pays Tributes To The Soldiers Who Lost Their Lives In Handwara Terrorist Attack

కరోనా వల్ల రాత్రింబవళ్లు ఎలాంటి అలుపు లేకుండా మన కోసం పనిచేస్తున్న డాక్టర్స్, పోలీసులు, నర్సులు మరియు పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి ఇటీవలే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి.. మనదేశ సైనికులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘హంద్వారా దాడి.. మన దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. దేశాన్ని కాపాడటానికి మన సైనికులకు ఉన్న ధైర్యం, సంకల్పం చాలా ధ్రుడమైనవి. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. విధి నిర్వహణలో మరణించిన సైనికులకు నిల్చుని మౌనం పాటించి నివాళులర్పిస్తున్నాను. ఎదురుకాల్పుల్లో మరణించినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వారికి ధైర్యం, బలం ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. జై హింద్‌’ అని మహేష్‌ బాబుపేర్కొన్నారు.

కాగా, మహేష్‌ బాబు ఇటీవల నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆర్మీ మేజర్‌ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక తన తర్వాత సినిమా పరుశురాంతో చేస్తున్న సంగతి తెలిసిందే. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 19 =