ప్రభాస్ సరసన కియారా అద్వాని?

Bollywood Actress Kiara Advani To Play Alongside Rebel Star Prabhas In Prabhas 21

‘భరత్ అనే నేను’తో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది ఉత్తరాది భామ కియారా అద్వాని. తొలి చిత్రంతోనే ఘనవిజయాన్ని చవిచూసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై ‘వినయ విధేయ రామ’లోనూ నాయికగా సందడి చేసింది. ఈ రెండు చిత్రాల్లోనూ అగ్ర కథానాయకులతోనే జట్టుకట్టింది కియారా. ‘భరత్ అనే నేను’లో సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ, ‘వినయ విధేయ రామ’లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తోనూ ఆడిపాడింది. తదనంతరం బాలీవుడ్ పైనే దృష్టిపెట్టిన ఈ సొగసరి త్వరలో మరో తెలుగు చిత్రంలో నటించబోతోందని సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈసారి కూడా స్టార్ హీరోతోనే చిందులేయనుందట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ ఫేమ్ నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ – వరల్డ్ మూవీగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే కథానాయిక పాత్ర కోసం దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ వంటి ప్రముఖ బాలీవుడ్ కథానాయికల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ బడ్జెట్ మూవీలో నటించే అవకాశం కియారాకు దక్కిందని వినికిడి. త్వరలోనే ‘ప్రభాస్ 21’లో కియారా ఎంట్రీపై క్లారిటీ రానుంది.

కాగా, 2021 ఫిబ్రవరి నుంచి ప్రభాస్, నాగ్‌అశ్విన్ కాంబినేష‌న్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.