మోహన్ లాల్ హీరో గా మలయాళంలో గత ఏడాది వచ్చిన ‘లూసిఫర్’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడో దక్కించుకున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా ఆయన ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాను సాహో డైరెక్టర్ సుజిత్ తో డైరెక్ట్ చేయించాలని చిరు కూడా ప్లాన్ లో వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనిలో సుజిత్ ఉన్నట్లు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అల్లు అర్జున్ చేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘లూసిఫర్’ సినిమాలో మోహన్ లాల్ కి నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో ఈ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారట. అంతే ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా వున్నాడన్న వార్తలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆ వార్తల్లో నిజం లేదని తేలింది.
ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేయట్లేదని బన్నీ టీం క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం…
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: